ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని 60 డివిజన్లకుగాను మొత్తం 522 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 163, కాంగ్రెస్ నుంచి 125, బీజేపీ-84, టీడీపీ-16, సీపీఐ(ఎం)-35, సీఐఐ-7, స్వతంత్రులు-76, ఇతరులు 16 నామినేషన్లు దాఖలు చేశారు.
సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆదివారం మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏప్రిల్ 24 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని తెలిపారు. ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలన్నా పోలీసుల నుండి అనుమతి పొందాలన్నారు. సోషల్ మీడియా వేదికలపై హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.