రాయికోడ్, మే16: సమాజసేవే తమ లక్ష్యమని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంగమేశ్వర్పాటిల్ అన్నారు. మండల పరిధిలోని జంబ్గి(కె) గ్రామంలో ఆదివారం కరోనాతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తనవంతు సాయంగా 5 కిలోల సన్న బియ్యం, కోడిగుడ్లు, పప్పులు, మాస్క్లు, శానిటైజర్లు, సబ్బులు, బిస్కిట్ ప్యాకెట్లతో పాటు వారికి అవసరమైన వస్తువులను ఆయన సర్పంచ్ పార్వతిశ్రీకాంత్తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బస్వరాజుపాటిల్ ఆదేశాల మేరకు తమ సొంత నిధులతో మండలంలో ఉన్న కరోనా బాధితులకు, ఇంటి వద్ద ఉంటూ ఆహారం కోసం ఇబ్బంది పడే వారికి ఆహారం అందజేస్తామని, తమ సమాచారం ఇవ్వాలన్నారు. మే, జూన్ మాసాల్లో తమవంతుగా మండలంలోని కరోనా సోకిన వ్యక్తులకు సాయం చేస్తామని తెలిపారు. సెల్ నంబర్ 8074686471కు సమాచారం ఇస్తే కరోనా బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సాయం చేస్తామన్నారు. అలాగే, మండలంలోని ఎవరైనా దాతలు కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకువస్తే మా సేవలను మరింత విస్తరిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల నాయకుడు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.