రామచంద్రాపురం, మే 10 : ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్ అన్నారు. సోమవారం డివిజన్లోని శ్రీనివాస్నగర్కాలనీ, హనుమాన్ ఆలయం ఏరియాలో డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఆమె సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించారు. ఆశ వర్కర్లు సర్వే నిర్వహిస్తున్న వారితో కార్పొరేటర్ చర్చించారు. ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారని ఆశ వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా బారిన పడినవారు భయపడకుండా హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. ఆమె వెంట నాయకులు లక్ష్మణ్, సత్యనారాయణ, మానయ్య, మోహన్, ఎంటమాలజీ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరోనా వైరస్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొండాపూర్ పోలీసులు సూచించారు. మల్కాపూర్ చౌరస్తా, రాజంపేట రోడ్డులో ప్రజలు, వాహనదారులకు కరోనా పై పోలీసులు అవగాహన కల్పించారు.
10,370 ఇండ్లలో సర్వే
కరోనాను కట్టడి చేసేందుకు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యం లో పట్టణంలోని 38 వార్డుల్లో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించారు. ఇం టింటి సర్వేలో కరోనా వైరస్ లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారిని గుర్తించి అవగాహన కల్పించి వారికి మెడికల్ కిట్లను అందజేశారు. మున్సిపల్ పరిధిలోని 38 వార్డుల్లో 22,341 ఇండ్లు ఉండగా సోమవారం 454 ఇండ్లను సర్వే చేసి 296 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంత రం వారికి మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సయ్యద్ సాజిద్, బృందం సభ్యులు పాల్గొన్నారు.
ముబారక్పూర్లో రసాయనాల పిచికారీ
కరోనా వైరస్ నివారణ కోసం ముబారక్పూర్ గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సదాశివపేట మండలం ముబారక్పూర్ సర్పంచ్ శ్రీవాణీదశరథ్ ఆధ్వర్యంలో గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సిబ్బంది పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం లో కరోనా కేసులు పెరుగుతున్నందున ముబారక్పూర్(ఏ), ముబారక్పూర్(బీ)లోని అన్ని వార్డుల్లో రసాయనాలను పిచికారీ చేశామన్నారు.
ఇంటింటి ఆరోగ్య సర్వే
కరోనాను కట్టడి చేసేందుకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గుమ్మడిదల, కానుకుంట, వీరన్నగూడెంలోవెద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరా లు సేకరించారు. జ్వరం, దగ్గు ఉన్న వారికి మందులు అందజేశారు. గుమ్మ డిదలలో జడ్పీటీసీ కుమార్గౌడ్, తహ సీల్దార్ సుజాత, కానుకుంట పీహెచ్సీ పరిధిలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఆశవర్కర్ హేమలత సర్వే నిర్వ హించారు
సర్వేకు ప్రజలు సహకరించాలి
ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కోరారు. అమీన్పూర్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మ న్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వే నిర్వహించి కరోనా లక్షణా లు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు.
సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
గ్రామాల్లో వైద్య సిబ్బంది చేపడుతున్న ఇంటింటి సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంగమణి సూచించారు.మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విలేకర్లతో ఆమె మాట్లాడారు. ఇంట్లో ఉన్నవాళ్లు సైతం మాస్క్ తప్పకుండా ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ డబుల్ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.