-విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రూ.5లక్షల చెక్కు అందజేత
అందోల్ : చౌటకూరు మండల పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పరి అంజయ్య కొన్ని రోజుల కితం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విద్యుత్ శాఖ జోగిపేట డివిజన్ సంగారెడ్డి సర్కిల్ అధికారులతో మాట్లాడి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే సూచన మేరకు
విద్యుత్ శాఖ మంజూరు చేసిన రూ.5లక్షల చెక్కును శనివారం ఉప్పరి అంజయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ సురేశ్కుమార్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా, సీనియర్ నాయకులు నారాయణ, లింగా గౌడ్, సాయికుమార్, ఉప్పరిగూడెం సర్పంచ్ అల్వాల రేణుకానర్సింలు, పుల్కల్ ఉమ్మడి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిష్టారెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.