నర్సాపూర్/ చిలిపిచెడ్/ వెల్దుర్తి, మే 18 : నర్సాపూర్ నియోజక వర్గంలో బుధవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి పర్యటిం చారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. దీంతోపాటు ‘మన ఊరు- మనబడి’ లో ఎంపిక పాఠశాలల్లో వివిధ పనులను ఎమ్మెల్యే ప్రారంభిం చారు. నర్సాపూర్లోని ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన 68 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప థకాలతో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా లభించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, ఎంపీపీ జ్యోతీసురేశ్నాయక్, వైస్ఎంపీపీ వెంకటనర్సింగరావు, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్ భాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, స ర్పంచ్లు శివకుమార్, శ్రీరాము లు, సురేశ్గౌడ్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు చంద్రశేఖర్, నేత లు అశోక్గౌడ్, రవి పాల్గొన్నారు.
కాళేశ్వరం నీటితో చెరువు, కుంటలు నింపుతాము..
వచ్చే యేడాదిలోగా కాళేశ్వ రం నీటితో ప్రతి చెరువు, కుంటలను నింపుతామని చిలిపిచెడ్ మండల రైతులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి భరోసా ఇచ్చారు. చిలిపిచెడ్ రైతు వేదికలో తహసీల్దార్ కమలాద్రి అధ్యక్షతన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరయ్యారు. మండలంలోని 34 మంది లబ్ధ్ధిదారుల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదా దుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, మండల కోఆప్షన్ సభ్యుడు షఫీ, సర్పంచ్లు మాంతప్ప, గోపాల్రెడ్డి, పరశురాంరెడ్డి, కవితాముకుందరెడ్డి, రాకేశ్నాయక్, మమతాబాబు, టీఆర్ఎస్ నాయకులు దుర్గారెడ్డి, సయ్యద్ హుస్సేన్, మాణ్యికరెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నర్సాపూర్ పట్టణంలో అజయ్ యాదవ్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్లోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, నేతలు రమేశ్యాదవ్, నగేశ్, భిక్షపతి పాల్గొన్నారు.
దళితబంధుతో ఆర్థికాభివృద్ధి..
సీఎం కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకం దళితుల ఆర్థికా భివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధ్దిదారు ముక్క పద్మ.. చిన్నశంకరంపేట మండ లం ధరిపల్లిలో స్టీల్, సిమెంట్ దుకాణం ఏర్పాటు చేయగా, ఎ మ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితబంధు పథకం ద్వారా దళితులు స్వశక్తితో ఎదిగి, ఆర్థికాభివృద్ధి సాధించి గౌరవంగా బతికి అందరికీ ఆద ర్శంగా నిలవాలన్నారు. లబ్ధ్దిదారుల ఇష్టానుసారంగానే యూ నిట్లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బాలేశ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి పాల్గొన్నారు.