సంగారెడ్డి : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నారింజ వాగు ఉధృతంగా ప్రవహించడంతో బూచినెల్లి -ఘనపూర్ మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న బూచనెల్లి శివారులో ఉన్న నారింజ వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోమవారం నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో కర్ణాటక నుంచి జహీరాబాద్ వైపు వచ్చే ప్రజలు బీదర్ నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.