కరోనా మహమ్మారి విలయవ కొనసాగుతూనే ఉంది. చిన్న చితకా, ముసలి ముతక, యువకులు ఇలా ప్రతి ఒక్కరు కరోనా బారిన పడి కన్నుమూస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ సోదరుడు పి.సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు.
కొన్నిళ్ల తర్వాత సోమశేఖర్ వ్యాపారాలలోకి వెళ్లారు. అప్పటి నుండి వర్మకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని వర్మ పలు సందర్భాలలో చెప్పిన విషయం విదితమే. సోమశేఖర్ అకాల మరణంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఆయనకు తన తల్లి అంటే ఎంతో ప్రేమని, ఆమెను కాపాడుకునే ప్రయత్నంలో తన ప్రాణాలు విడిచాడని సన్నిహితులు అంటున్నారు.