సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తాండూరు, ఏప్రిల్ 16: యాలాలా మండలం కోకట్ గ్రామానికి చెందిన ప్యాట బాల్రెడ్డి కరోనాతో మృతి చెందడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ ద్వారా బాల్రెడ్డి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా పరామర్శించారు. బాల్రెడ్డి మృతి బాధాకరమని, ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అప్పట్లో దేశ పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు బాల్రెడ్డి ఎప్పుడూ వెంటే ఉండేవడని, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసేవారని లేఖలో పేర్కొన్నారు. కాగా, పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు బాల్రెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించారు.