నారాయణఖేడ్, ఏప్రిల్ 2 : ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను మహిళలు, యువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. జీవిత గ్రామీణ వికాస్ యోజన పథకం ద్వారా మానూరు మండలం మాయికోడ్కు చెందిన మహిళా సంఘం సభ్యురాలు చాకలి భాగ్యశ్రీకి మంజూరైన ఆటోను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్రావు, నాయకులు మోహన్రెడ్డి, సుధాకర్, రాజు, విఠల్రావు, వినోద్రెడ్డి, ఎం.ఏ.నజీబ్, రాములు, ఐకేపీ ఏపీఎం వంశీకృష్ణ, మహిళా సమాఖ్య బాధ్యులు లక్కీబాయి, నర్సమ్మ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
నారాయణఖేడ్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అంబాదాస్ తండ్రి నర్సింహులు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ కార్యకర్త రవికాంత్ కుమారుడు అనారోగ్యంతో ఉండటంతో రవికాంత్ను కలిసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.