సంగారెడ్డి : జిల్లాలో రెండు చోట్ల పోలీసుల దాడుల్లో భారీగా ఎండు గంజాయి బయటపడింది. సదాశివపేటలో వెయ్యి కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి నుంచి నాందేడ్కు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని ఎస్పీ రమణ కుమార్ మీడియాకు తెలిపారు.
మరోవైపు జిల్లాలోని కోహిర్ మండలం పీచేర్వాగడిలో రూ.21 లక్షల విలువైన 140 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి గంజాయిని ముంబై తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వ్యాన్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.