సంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు కేశవరావు, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, పట్టణ, మండల అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి సభ్యు లతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వివరించాలని సూచించారు. టీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పట్టణ, మండల అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీపీలు కష్టపడి పనిచేయాలన్నారు.
కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నాయకులకు సూచించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లోని ఐటెక్స్లో పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 15వ తే దీన వరంగల్లో సింహాగర్జన సభ నిర్వహించనున్నట్లు వివరించారు. సింహాగర్జన సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేపడుతున్నట్లు వివరించారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజలు హాజరయ్యేలా చూడాలని నాయకులకు సూచించారు. సమావేశంలో గ్రంథాల సంస్థ చైర్మన్ నరహారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మ, ఎంపీపీ యాదమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సుమిత్రాసుధీర్రెడ్డి, పట్టణ నాయకుడు చీలమల్లన్న, కొండాపూర్ ఎంపీపీ మనోజ్రెడ్డి, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, రైతు సమన్వయ సమితి సభ్యులు మల్లేశం, కంది మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఎంపీపీ సరళ, జడ్పీటీసీ కొండల్రెడ్డి, మార్కెట్ కమిటీచైర్మన్ చిల్వెర పద్మావతి ప్రభాకర్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సునీత మనోహర్గౌడ్ పాల్గొన్నారు.