కౌడిపల్లి, ఏప్రిల్ 2 : తునికి నల్లపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తునికి గ్రామంలో నల్లపోచమ్మ ఆలయంలో మూడో రోజు జాతరలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్తో కలిసి పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనంగా వారికి స్వాగతం పలికారు. వచ్చే సంవత్సరంలోగా కరోనా పూర్తిగా తగ్గుము ఖం పట్టాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నారు. జాతరలో భాగంగా బం డ్ల ఊరేగింపు కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలు కల్పించింది.
ఏకో టూరిజం ఏర్పాటుకు కృషి
నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి సహకారంతో ఏకో టూరిజం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గం హైదరాబాద్కు దగ్గరలో ఉండటం, అటవీ ప్రాంతం ఉండటంతో అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవితఅమర్సింగ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, స్థానిక నాయకులు గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శివాంజనేయులు, ఆలయ ఈవో మోహన్రెడ్డి పాల్గొన్నారు.