షాబాద్, డిసెంబర్ 18 : అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంచాని నర్సింహరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సింహ్మరెడ్డి స్వగ్రామం కుమ్మరిగూడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి రూ. 20 వేల నగదును అందజేశారు. అధికారులతో చర్చించి రైతు బీమా తదితర సహాయం వెంటనే అందేలా చూస్తామని ఆయన తెలిపారు.
ఉద్యమ కాలంలో స్వరాష్ట్రం కోసం నర్సింహ్మరెడ్డి ఎంతో తపించే వాడని గుర్తు చేశారు. అదేవిధంగా కుమ్మరిగూడ మాజీ సర్పంచ్ రాములుగౌడ్ తల్లి మరణించింది. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో సర్దార్ నగర్ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ నక శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ యాస మల్లారెడ్డి, సర్పంచ్ పొనమోని కేతన, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పెంటయ్య, శివ రాములు పాల్గొన్నారు.