వికారాబాద్ జిల్లాలో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,47,502 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 50,660 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ నెలాఖరులోగా వరి నాట్లు వేసేందుకు అన్నదాతలు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వానకాలం వర్షాలు అధికంగా కురువడంతో చెరువులు, కుంటలు నిండడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో గడిచిన ఏడాది కంటే ఈసారి అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో వరి సాగుతో పాటు వేరుశనగ, శనగ, కుసుమ పంటలను అధికంగా సాగు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే జిల్లాయంత్రాంగం ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. తెలంగాణ ప్రభుత్వం సాగు మొదలు పంట చేతికొచ్చేవరకు పూర్తి సహకారాన్ని అందిస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిగి, డిసెంబర్ 11: యాసంగి సీజన్లో వికారాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం 50 వేల ఎకరా లు దాటింది. ఈసారి యాసంగిలో అన్ని పం టలు కలిపి 1,47,502 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నా రు. ఇందుకు అనుగుణంగా అవసరమైన విత్తనా లు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నారు. 2021 యాసంగితో పో లిస్తే ఈ యాసంగిలో సుమారు 42వేల ఎకరా లు అదనంగా సాగవుతాయని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఈసారి జిల్లాలో వర్షా లు పుష్కలంగా కురువడంతో చెరువులు నిండిపోవడంతోపాటు భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. జిల్లాలోని బోర్లలో పుష్కలంగా నీరు ఉంది. దీంతో ఇప్పటికే 50,660 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగనున్నది.
50,660 ఎకరాల్లో..
జిల్లాలో ఈ యాసంగిలో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో ప్రధానంగా వేరుశనగ, శనగ, కుసుమ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వేరుశనగ 11,623 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వే యగా 21,610 ఎకరాలు (185శాతం), శనగ 12,358 ఎకరాలకుగాను 18,219 ఎకరాల్లో (147శాతం), కుసుమలు 1,364 ఎకరాలకుగాను 4,386 ఎకరాల్లో (321శాతం) అంచనా కు మించి సాగయ్యాయి. జొన్న 6,147 ఎకరాలకుగాను 2,661 ఎకరాలు, మొక్కజొన్న 3,7 74 ఎకరాలకుగాను 2420 ఎకరాల్లో సాగైంది. కందులు 969 ఎకరాల్లో, బెబ్బర్లు 132, ఇతర పంటలు 1,200 పైచిలుకు ఎకరాల్లో ..వరి మిన హా మిగతా పంటలు సుమారు మరో రెండు వేల పైచిలుకు ఎకరాల్లో సాగైనట్లు అధికారులు పే ర్కొంటున్నారు. వరి మినహా మిగతా పంటల సాగు సుమారు 53 వేల ఎకరాల వరకు ఉండనున్నది. ఇదిలావుండగా జిల్లాలో గత రెండు, మూడేండ్ల నుంచి యాసంగిలో కుసుమ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ఈ సారీ అంచనా మించి సాగు కానున్నది.
నెలాఖరు నుంచి వరినాట్లు..
జిల్లాలో ఈనెలాఖరు నుంచి వరినాట్లు ప్రా రంభం కానున్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని చెరువులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండటంతో గతేడాది కంటే ఈసారి అధిక విస్తీర్ణంలో వరినాట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. జిల్లాలో వరి సాగు సుమా రు 80వేల ఎకరాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. కాగా పంటల సాగు కోసం సుమారు 30,891 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. యూరియా 12,487 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,700, ఎంవోపీ 1,796, ఇతర కాంప్లెక్స్ ఎరువులు 7,3 87, ఎస్ఎస్పీ 2,521 మెట్రిక్ టన్నుల ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్లలో బఫర్ స్టాకులు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
30,891 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం
జిల్లాలో ఈ యాసంగి సీజన్లో అన్ని పం టలు కలిపి సుమారు లక్షా30వేల పైచిలుకు ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేస్తు న్నాం. ఇప్పటికే జిల్లా లో సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు దాటిం ది. వరినాట్లు ఈ నెలాఖరు నుంచి ప్రారం భం కానున్నాయి. ఈ యాసంగి పంటల సాగుకు సుమారు 30,891 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి