యాచారం : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి, గజమాల వేసి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని నియమించడం శుభపరిణామమని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆయన సలహాలు, సూచనలతో మండలంలో పార్టీని మరింత ముందుకు తీసుకుపోతామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప టీఆర్ఎస్ నాయకులు రమేశ్, కిషన్, శ్రీనివాస్, కృష్ణ, సురేష్, బోడ కృష్ణ, శ్రీశైలం, ప్రవీణ్, మధుకర్, అమేర్, అక్బర్, తేజ, కరుణాకర్, శివ తదితరులు ఉన్నారు.