ఆమనగల్లు, జనవరి 13 : ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అందరివాడని ఎంపీ రాములు , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండల పరిధిలోని చింతలపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు అంబేద్కర్ను కొందరికే పరిమితం చేసి చూస్తున్నారని, అది ముమ్మాటికీ సరైంది కాదన్నారు.
బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొంటూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎన్బీసీ సభ్యుడు తల్లోజు ఆచారి, అంబేద్కరిస్టు జేబి రాజు, సీఐ జాల ఉపేందర్, ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, చింతలపల్లి సర్పంచ్ మంజుల, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటీ సభ్యుడు పత్యానాయక్ , అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వగ్గు మహేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా కల్యాణోత్సవం
కడ్తాల్, జనవరి 13 : మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో శుక్రవారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవం పురస్కరించుకొని ఆలయాన్ని కొబ్బరి, మామిడాకుల తోరాణాలతో, వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకించి, ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పూలహారాలతో గోదాదేవి, రంగానాథస్వామి వారి విగ్రహాలను అందంగా అలంకరించారు.
స్వామి వారికి పట్టు వస్ర్తాలను బాచిరెడ్డి మంజుల, నరేందర్రెడ్డి దంపతులు సమర్పించగా… పుస్తె మెట్టెలను మాధవి, రమేశ్చారి దంపతులు అందజేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, ముత్యాల తలంబ్రాలతో గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్యాణోత్సవంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను ఎంపీకి, ఎమ్మెల్సీకి అందజేసి, వారిని శాలువాలతో సన్మానించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణలో కాంటేకార్ రాఘవేందర్జీ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు సురేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, చందోజీ, హన్మానాయక్, శ్రీనివాస్రెడ్డి, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, జంగారెడ్డి, యాదయ్యగౌడ్, వెంకటేశ్, డాక్టర్ శ్రీనివాస్, శాయిరెడ్డి, శేఖర్రెడ్డి, జహంగీర్అలీ, వెంకటేశ్, రాఘవేందర్, రవీందర్రెడ్డి, పెంటారెడ్డి, ప్రభులింగం, పాండు, రాములు, సుమన్, అర్చకులు తిరునగరి భానుప్రసాద్, లక్ష్మణాచార్యులు, శ్రీధర్, పవన్కల్యాణ్, శ్రీమన్నారాయణ, నర్సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.