‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టడంతోపాటు భవనాలకు మరమ్మతులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణం, పెయింటింగ్, ప్రహరీలు, తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలో మొదటి విడుతలో 468 పాఠశాలలు ఎంపికకాగా.. 448 పాఠశాలలకు రూ.97.88కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను ఇచ్చింది. ఇప్పటివరకు 65 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.
-రంగారెడ్డి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)
‘మన ఊరు-మన బడి’ తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. డ్యూయల్ డెస్క్లు, హ్యాండ్వాష్లు, మరుగుదొడ్లు, డైనింగ్ హాళ్లు తదితర వసతులు సమకూరు తున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాణ్యమైన విద్యనందించి వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
-నరేంద్ర బోగం, హెచ్ఎం, కందవాడ ప్రాథమిక పాఠశాల, చేవెళ్ల
రంగారెడ్డి, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ‘మన ఊరు-మన బడి’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నిధులను కేటాయిస్తుండడంతో అనేక పాఠశాలల్లో వాటి రూపురేఖలు మారిపోతున్నాయి. ఆకర్షణీయ రంగులతో..సరికొత్త హంగులతో..మౌలిక వసతుల కల్పనతో కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి. జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో 468 పాఠశాలలు ఎంపికకాగా.. 448 పాఠశాలలకు రూ.97.88 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను ఇచ్చింది. ఇప్పటివరకు 65 పాఠశాలల్లో పనులు పూర్తై పునః ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 12 రకాల వసతులను కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ లుక్ తీసుకొస్తున్నది. తాగునీటి వసతితోపాటు శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్లను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొస్తున్నది. విద్యుద్దీకరణ, ఫర్నిచర్, పిల్లలకు డ్యూయల్ డెస్క్లు, ఉపాధ్యాయులకు బెంచీలు, కుర్చీలు, బీరువాలను సమకూర్చుతున్నది. పెద్ద, చిన్న తరహా మరమ్మతులను చేపట్టడంతోపాటు గ్రీన్ బోర్డులు, ప్రహరీ, వంటగది, నూతన గదులు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాల, డిజిటల్ తరగతి గదులను నిర్మిస్తున్నది. బడులకు రంగులు వేయించి రకరకాల బొమ్మలు వేయడం ద్వారా కొత్త కళను తీసుకొస్తున్నది.
సీఎం కేసీఆర్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో సర్కారు బడులు కొత్త ఒరవడిని ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు అల్పాహారం, మధ్యాహ్నభోజనం అందిస్తున్నారు. దూర ప్రాం తాల నుంచి వచ్చేవారికి ఉచిత బస్ పాస్లను కల్పిస్తున్నారు. ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలను అందించడంతోపాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. డిజిటల్ తరగతులు, ల్యాబ్స్ వంటి వసతులను కల్పించారు. ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టగా అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా సర్కారు బడుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో మోయలేని ఫీజుల భారం..ప్రైవేట్కు దీటుగా ఎందులోనూ తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండడం వంటి కారణాలతో విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రవేశాలు పెరిగి ప్రభుత్వ బడులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని పాఠశాలలు అడ్మిషన్లు ఫుల్ అని బోర్డులు పెట్టుకోవాల్సి రావడం వంటి సంఘటనలు ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న క్రేజ్కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 881 ప్రైమరీ పాఠశాలల్లో 63వేల మంది, 181 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 15,500 మంది, 248 హైస్కూళ్లల్లో 65వేల మంది కలిపి మొత్తం 1,43,500 మంది విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో బడుల రూపురేఖలను మార్చుతున్నది. మా పాఠశాలలో మంచి నీటి, విద్యుత్తు, వంట గది, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, గ్రీన్చాక్ బోర్డు ఏర్పా టుతోపాటు పాఠశాలకు కలర్ వేయడం జరిగింది. దీంతో స్కూల్ నూతన శోభను సంతరించుకున్నది. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు.
-ధనుంజయ్యగౌడ్, ఉపాధ్యాయుడు, కడ్తాల్ మండలం
శివారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే వసతులు మెరుగయ్యాయి. ఉపాధ్యాయులు చాలా బాగా బోధిస్తున్నారు. అన్ని రకాల వసతులుండడంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి నా స్నేహితులు ఇక్కడికొచ్చి చేరుతున్నారు. టీచర్లు స్కిల్ డెవలప్మెంట్కు సంబం ధించిన నైపుణ్యాలనూ చెబుతున్నారు.
-సాయితేజ, 5వ తరగతి,శివారెడ్డిపల్లి పాఠశాల, దోమ మండలం
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడులకు మహర్దశ వచ్చింది. కార్పొరేట్కు దీటుగా సర్కారు పాఠశాలల్లో వసతు లు మెరుగవుతు న్నాయి. విద్యార్థుల కు అన్ని సౌకర్యాలు సమకూరుతుండడంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది.
-రాజశేఖర్,ప్రాధానోపాధ్యాయుడు, శంకర్పల్లి
సీఎం అల్పాహార పథకంతో విద్యార్థుల హాజ రు శాతం గణనీ యంగా పెరుగడంతోపాటు డ్రాప్అవుట్ల సంఖ్య తగ్గింది. ఇప్పటికీ ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం ప్రభుత్వ రూపురేఖలను ఎంతో మార్చుతున్నది. ప్రభుత్వ బడులు కార్పొరేట్ కు దీటుగా మారుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-ఉమారాణి, గౌతాపూర్ పాఠశాల హెచ్ఎం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్ర భుత్వ బడుల రూపురేఖలు ఎంతో మారుతున్నాయి. కార్పొరేట్కు దీటుగా వసతులను కల్పిస్తుండటంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు సర్కారు బడులకు తిరిగి వస్తుండటంతో హాజరు శాతం కూడా పెరుగుతున్నది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతున్నది.
– రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, నోముల
మన ఊరు-మన బడి ఓ అద్భుత కా ర్యక్రమం. దీని ద్వారా ప్రభుత్వ బడు ల్లో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి. శిక్షణ పొందిన టీచర్లతో స్టూ డెంట్లకు నాణ్యమైన విద్య అందుతున్నది. -అక్బర్, ఉపాధ్యాయుడు, చేవెళ్ల