రైతుబంధు సాయం చేతికందడంతో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. పొద్దస్తమానం రైతులంతా వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదివరకు అప్పుల కోసం తిరుగుతూ సమయం వృథాకావడంతో పంటల సాగు ఆలస్యమయ్యేది. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సకాలంలో పెట్టుబడి డబ్బులు అందిస్తుండడంతో అన్నదాతలు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో యాసంగికి సంబంధించి 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశమున్నదని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లాలో 2,94,788 మంది రైతుల ఖాతాల్లో రూ.306.43కోట్లను రైతుబంధు కింద ప్రభుత్వం జమ చేసింది.
రంగారెడ్డి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేయగా.. వర్షాలు బాగా కురిసి జలాశయాలు, చెరువులు, బావులు నిండటంతో అంచనాకు మించి పంటలు సాగు కానున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంటల సాగులో పెను మార్పులొచ్చా యి. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తూ, రైతును రాజుగా చేసేందుకు నిత్యం కృషి చేస్తున్నారు. భూములను చదును చేయడం దగ్గ ర నుంచి పంట చేతి కొచ్చేంత వరకు అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. వరికి గిట్టుబాటు ధరను ఇచ్చి కొనుగోలు చేస్తూ రైతులకు ఆర్థికం గా ఆదుకుంటున్నారు. ప్రతి ఏడాది రైతులకు ఎకరానికి రూ.పదివేల చొప్పున అందిస్తున్నారు. రైతులు సకాలంలో ఎరువులు, విత్తనాలను ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నారు. దీం తో జిల్లాలోని రైతులంతా పండుగ వాతావరణం లో ఎవుసం చేసుకుంటున్నారు. జిల్లాలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, కుసుమ, పొద్దు తిరుగుడుతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పూల తోటలను కూడా సాగు చేస్తున్నారు.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో రైతులు సాగునీరు, విత్తనాలు, విద్యుత్ కోసం ఇబ్బందులకు గురయ్యే వారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులకు ఆ తిప్ప లు తప్పాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు పండుగలా వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. పంట రుణాలు, ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించి వ్యవసాయాన్ని దండుగ అన్న వారికి, ‘అది దండుగ కాదు.. పండుగ’ అని రుజువు చేశారు. రైతన్న బాగుంటేనే దేశం మంచిగా ఉం టుందని నమ్మిన సీఎం కేసీఆర్ పంటల సాగు కోసం అన్నదాత ఆర్థిక ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ‘రైతుబంధు’ను తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఎకరం భూమి ఉన్న ప్రతి రైతు కూ ఏడాదికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ యాసంగి సీజన్కు సంబంధించి 2,94,788 మంది రైతులు రైతుబంధు నిధులు అందుకున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు రైతుబంధు కింద రంగారెడ్డి జిల్లాలోని రైతులకు రూ. 306.43 కోట్లు అందాయి. కాగా పంట రుణాల మాఫీ రూ.50 వేలు మాఫీ కానున్నట్లు సమాచారం. దీని ద్వారా 20,519 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా గ్రా మాల్లోని రైతులకు పలు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదు. పంటల సాగు కోసం ఇతరుల వద్దకు అప్పుల కో సం వెళ్లాల్సి వచ్చేది. కానీ, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పంటల సాగు కోసం సకాలంలోనే రైతుబంధు నిధుల ను బ్యాంకుల్లో జమ చేసి రైతులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు నేను రెండుసార్లు రైతుబంధు నిధులను తీసుకున్నా. గతంలో ప్రజలను నాయకులు పట్టించుకోలేదు. కేసీఆర్ సార్ బాగుండాలి.
– తంగిడిపల్లి జంగయ్య, రైతు, చేవెళ్ల
గుంట భూమి ఉన్నా రైతులకు ప్రభుత్వం రైతుబంధు అందించి ఆదుకోవడం చాలా మంచి నిర్ణయం. గతంలో పంటలను సాగు చేయాలంటే ఇతరులు, వడ్డీ వ్యాపారుల వద్ద కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున ఏడాదికి రూ. పది వేలు అందించడంతో సాగు సకాలంలో సాగుతున్నది. ఎరువులు, విత్తనాలను ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాం. జనం కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి ప్రభుత్వాలే ఎక్కువ కాలం నిలుస్తాయి.
– శేఖర్, రైతు, కౌకుంట్ల గ్రామం
కేసీఆర్ సారు.. మనసున్న మారాజు. రైతులను గతంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రేషన్ కార్డు కూడా ఇచ్చేదికాదు. కేసీఆర్ వచ్చిన తర్వాత నాకు భూమి తక్కువగా ఉన్నా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, ఆసరా లాంటి పథకాలు వస్తున్నా యి. ఇప్పటికైతే.. ఎలాంటి ఇబ్బంది లేదు.
– టి.ఎర్ర చంద్రయ్య, రైతు, చేవెళ్ల
ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నది. రైతుబంధు, పంట రుణాల ను అందించి ఆదుకుంటున్నది. ప్రజల కష్టాలు, నష్టాలపై అవగాహన ఉన్న వారు అధికారంలోకి వస్తేనే మాలాంటి వారికి మంచి జరుగుతుంది. – జైపాల్రెడ్డి, రైతు, మడికట్టు