కడ్తాల్, జనవరి 1 : విద్యా శాఖ మంత్రి సబితారెడ్డిని ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి ఉన్నారు.
చేవెళ్ల రూరల్ : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంత్రి సబితారెడ్డిని ఆమె నివాసంలో రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు చింతకింది నాగార్జునరెడ్డి, బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు ఎదిరె రాములు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం నోట్ పుస్తకాలు అందజేశారు. మంత్రి వారిని అభినందించారు.
చేవెళ్లటౌన్ : నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం చేవెళ్ల మండల నాయకులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యను కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి నోటుబుక్స్ను అందజేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, చేవెళ్ల మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు, నాయకులు తదితరులు ఉన్నారు.