ఆర్కేపురం, ఆగస్టు 2 : గ్రీన్హిల్స్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయసహాకారాలు అందిస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి తెలిపారు. గ్రీన్హిల్స్ కాలనీలోని పార్కు అభివృద్ధి, కమ్యూటీ హాల్ పనులు త్వరలోనే ప్రారంభమైతాయని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆర్కేపురంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, సీఎం కేసీఆర్తో మాట్లాడి నిధుల కొరతలేకుండా చూస్తామన్నారు. కాలనీ ప్రజలందరకు కలిసి కట్టుగా ఉండి కాలనీలను అభివృద్ధి చేయించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రీన్హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వజ్రాల సంజీవరెడ్డి, చైర్మన్ పి.సంజీవరెడ్డి, కన్వీనర్ ఎ.మహేందర్, కార్యదర్శలు సి.హరినాథ్, మురళీధర్రెడ్డి, సుధాకర్, రామ్మోహన్, విక్కి, మనోహరమ్మ, పుష్షలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.