షాబాద్, మార్చి 25 : చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..కుమ్మరిగూడ, పోతుగల్ ప్రాంతాలలో భూములు కోల్పోతున్న రైతులకు కనీసం 1000 గజాలు స్థలం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్తో ఫోన్లో మాట్లాడారు.
భూములు కోల్పోయిన రైతుల కోసం తాను ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తానని, కనీసం 1000 గజాలకు తక్కువ ఇవ్వకూడదని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్రావు, తాసిల్దార్ అమరలింగంగౌడ్, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో సర్దార్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, సీనియర్ నాయకులు పోన్న నర్సింహారెడ్డి, ఆయూబ్ఖాన్, పోనమోని రమేశ్యాదవ్, రవీందర్గౌడ్, పాండురంగారెడ్డి, నర్సింహులు, రైతులు తదితరులున్నారు.