‘దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు.. అంబేద్కర్ కలలుగన్న సమానత్వాన్ని తీసుకురావాలనేది ఆయన సంకల్పం.. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన సీఎం.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధను ప్రవేశపెట్టారు..’ అని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది.
రంగారెడ్డి, ఫిబ్రవరి 10, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం క్రమం తప్పకుండా కేటాయిస్తున్న నిధులతో వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. పచ్చని చెట్లతో హరితశోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్తోపాటు సీసీ రోడ్లు, రైతువేదిక భవనాలను నిర్మించారు. మరోవైపు పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని సేకరించి పంచాయతీ ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేసి నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు వినియోగిస్తున్నారు. నిత్యం చెత్తను తొలగిస్తుండటంతో గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నా యి. మరోవైపు మరణించిన వారి దహన సంస్కారాలను నిర్వహించేందుకు అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భూమి, గుంట స్థలంలేని ఎందరికో సహకరిస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక వాకింగ్ ట్రాక్, వివిధ రకాల మొక్కలతో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు. పల్లెప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లను పూడ్చడం, శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించడం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో సర్కా ర్ తుమ్మ, జిల్లెడు వంటి పిచ్చి మొక్కలను తొలగించడం, రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి పనులతో గ్రామాల్లో గత రెండేండ్లు గా సీజనల్ వ్యాధులు ప్రబలకపోవడం గమనార్హం. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కూడా దూసుకుపోతున్న ది. ప్రతినెలా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు రూ.18 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు మంజూరయ్యాయి. రెండేండ్ల కాలంలో జిల్లాకు రూ.317.28 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి ప్రతినెలా రూ.18 కోట్ల చొప్పున జిల్లాకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నది. ఇందులో ప్రధానంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామా ల్లో మురుగునీరు రోడ్లపై నిలువకుండా చర్యలు చేపట్టారు. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక మొత్తంలో నిధు లు ఖర్చు చేశారు. గతంలో ఉన్న మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లను నిర్మించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన మరమ్మతులను కూడా పూర్తి చేశారు.
పంచాయతీల్లో కరెంట్ చార్జీలు, ట్రాక్టర్ల లోన్ చెల్లించడం, పారిశుధ్య పనులకు అధిక మొత్తంలో నిధులను వినియోగించారు. అదేవిధంగా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలతోపాటు 307 హాబిటేషన్లలో పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేశా రు. గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల్లో ఎకరం స్థలంలో నాలుగు వేల మొక్కలతో పల్లె ప్రకృతివనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో మొక్కలు, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకోసం ప్రభుత్వం రూ.9 లక్షలను ఖర్చు చేసింది.
గ్రామ పంచాయతీకి కేటాయించిన పది శాతం గ్రీన్ బడ్జెట్ నుంచి ప్రకృతివనాలకు ఖర్చు చేశారు. మరోవైపు ప్రతీ గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లతోపాటు ట్రాలీ, ట్యాంకర్లను అందజేసింది. ఆ ట్రాక్టర్లతో గ్రామాల్లో పారిశుధ్య సిబ్బంది సేకరించిన చెత్తాచెదారాన్ని తడి, పొడిగా వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించడం, పంచాయతీ పరిధిల్లో నాటే మొక్కలకు నీటిని అందించడం వంటి పనులకు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ల లోన్ డబ్బులను కూడా పల్లెప్రగతి నిధుల ద్వారానే ప్రతినెలా చెల్లిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో డంపింగ్ యార్డు నిర్మాణానికి రూ.6 లక్షలు ఖర్చు చేశారు. అదేవిధంగా మరణించిన వారి చివరి మ జిలీ గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చాలా మార్పు వచ్చింది. ఈ కార్యక్రమం క్రింద ప్రతినెలా రూ.18 కోట్ల నిధులను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేస్తున్నది. ఈ నిధులతో అన్ని గ్రామా ల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీతోపాటు అంతర్గత సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు, చెత్తాచెదారాన్ని తొలగించడం, రోడ్లను శుభ్రం చేయడం వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. దీంతో గ్రామాల్లోని రోడ్లు అద్దంలా మెరువడంతోపాటు, హరితవనంలా గ్రామాలు కనిపిస్తున్నాయి. – డీపీవో శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డి జిల్లా