పరిగి టౌన్ : మహాత్మగాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ దగ్గర గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు వేల కట్టలేనివని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యం పట్ల నిబద్దత పాటించాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవింద్రావు, జడ్పీటీసీ హరిప్రియారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, పరిగి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్రెడ్డి, కౌన్సిలర్లు వేముల కిరణ్, కృష్ణ, వెంకటేశ్, రవీంద్ర, నాగేశ్వర్, మునీర్, కోఆప్షన్ సభ్యుడు శేఖర్, జేఏసి నాయకుడు రవికుమార్ పాల్గొన్నారు.
పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాత్మగాంధీ జయంతి
పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాత్మగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, ఎంఈఓ హరిశ్చందర్, పరిగి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీశైలం, శ్రీనివాస్ పాల్గొన్నారు.