బంట్వారం : నేడు సమాజంలో వివిధ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అయితే సమాజంలోని ప్రతి వ్యక్తికీ తన హక్కులు, బాధ్యతలు తెలిసినప్పుడు నేరం చేసేందుకు వెనకడుగు వేస్తారన్నారు. దీంతో నేరాలు తగ్గుతాయని వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ‘న్యాయ విజ్ఞాన సదస్సు’ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దోపిడిలు, దాడులు, లైంగిక దాడులు, కిడ్నప్ లాంటి నేరలు జరుగుతున్నాయన్నారు. అయితే ఈ నేరాలన్ని అధికంగా చిన్న వయస్సు వాళ్లు ఎక్కువగా చేస్తున్నారనేది గమనించామని చెప్పారు. సమాజంలో పిల్లలు, బాలికలు, మహిళలు ఎక్కువ నేరాలకు గురైతున్నారన్నారు.
ఇందుకు ప్రధానంగా చిన్నతనం నుంచి వారు పెరిగిన వాతవరణం, ఇంట్లో తల్లిదండ్రుల పెంపకానికి సరైన విధంగా ఆదరణ లేక, పెంపకంలో ఎలాంటి పట్టింపులు లేకుండ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇలాంటి వాటికి గురైతున్నారని వివరించారు. ఇలాంటి నేరాలను పోలీసులు, కోర్టులు పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నాయని స్పష్టం చేశారు. అయితే సమాజంలో ప్రతి ఒక్కరికి తమ హక్కులు, బాధ్యతలు, చట్టలపై పూర్తి అవగాహన కల్పించాలని తమ న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మానవ సమాజంలో మన పుట్టుక నుంచి, సచ్చేంత వరకు మనమంత చట్ట పరిధిలోనే జీవిస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తి చట్ట పరిధిలోని తన దిన చర్య కొనసాగుతుందన్నారు. అలాంటప్పుడు చట్టాలను తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమాజం పాడవడానికి ప్రధానంగా ఇంటి నుంచే ప్రారంభమైతుందని చెప్పారు. ఇంటిలో తల్లిదండ్రుల పెంపకం, అటు తరువాత సమాజం, వీటితో పాటు సెల్ఫోన్, సినిమారంగం లాంటి మీడియా యువతను పెడదోవ పట్టేందుకు కారణమైతున్నాయని వ్యాక్యనించారు. తమ పిల్లలు ఎప్పుడు ఏమి చేస్తున్నారు.
ఎలాంటి అలవాట్లుకు అలవాటు పడుతున్నారనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. ఇంటి నుంచే నేర నియంత్రణ ఉండాలన్నారు. మైనర్గా ఉన్నప్పుడే పిల్లలు ప్రేమ పెళ్లి అంటు పేడతోవ పడుతున్నారని, అయితే పెళ్లి అనేది సాంప్రదాయబద్దంగా జరిగినప్పుడే, పెళ్లిని కోర్టు పరిగనిస్తుందని చెప్పారు. ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు కోర్టుకు వచ్చి న్యాయం కోసం పోరాడే స్థోమత లేదన్నారు. అయితే అలాంటి నిరుపేదలకు కోర్టుల్లో న్యాయం కొరకు పొరాడేందుకు సేవా సంస్థలు ఉన్నాయన్నారు. అందులో భాగంగానే మండల్ లీగల్ సెల్ కమిటీ ఉంటుందన్నారు. న్యాయం కొరకు నిరుపేదలు ఈ కమిటీని ఆశ్రయిస్తే న్యాయం పొందే అవకాశం ఉందన్నారు.
ఈ సదుపాయన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావాణ్యశ్రీనివాస్, ఎంపీపీ ప్రభాకర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహులు, తాసిల్దార్ నాగర్జున రెడ్డి, జిల్లా పోలీస్ భరోసా సెంటర్ నిర్వహకురాలు స్రవంతి, పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.