పరిగి, నవంబర్ 12: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వారికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండగా.. గతేడాది నుంచి రొయ్య పిల్లలను కూడా అందిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన పెద్ద ప్రాజెక్టులు, చెరువుల్లో పెంచేందుకు రొయ్య పిల్లలను ఉచితంగా అం దిస్తున్నది. జిల్లాలో చెరువులు, కుంటలు 775 వరకు ఉండగా ఈసారి కురిసిన భారీ వర్షాలకు నీటితో నిండిపోయాయి.
ఆరు ప్రాజెక్టులు, చెరువుల్లో 10.76 లక్షల రొయ్య పిల్లలు..
ఈ ఏడాది కూడా జిల్లాలోని ఆరు పెద్ద ప్రాజెక్టులు, చెరువుల్లో 10.76 లక్షల రొయ్య పిల్లలను పెంచేందు కు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. లఖ్నాపూర్ ప్రాజెక్టులో 1,33,500 రొయ్య పిల్ల లు, కొంశెట్టిపల్లి చెరువులో 88,500, కోట్పల్లి ప్రాజెక్టులో 5,24,400, మోమిన్పేట మండలంలోని నం దివాగులో 96,000, సర్పన్పల్లి ప్రాజెక్టులో 1,15,500, జుంటుపల్లి ప్రాజెక్టులో1,18,200 రొయ్య పిల్లలను వదులనున్నారు. 1.5 ఇంచుల పరిమాణంలో ఉన్న రొయ్య పిల్లలను ప్రభుత్వం కొని ఉచితంగా అందజేస్తున్నది. ఒక రొయ్య పిల్లకు రూ. 2.45 వెచ్చించనున్నది. ఈ మేరకు 10.76 లక్షల రొయ్యపిల్లలను రూ.26,36,200 ఖర్చు చేసింది. వీటికితోడు ఈసారి జిల్లాలోని 600 చెరువుల్లో కోటీ 19లక్షల చేప పిల్లలు ఉచితంగా వదలాలని ప్రభు త్వం నిర్ణయించగా ఇప్పటికే 78 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. మిగతా వాటిని వారం రోజుల్లో వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 93 లక్షల చిన్న చేప పిల్లలకు ఒక్కోదానికి 37.5పైసల చొప్పున రూ.34.87 లక్షలు.. 25 లక్షల పెద్ద సైజు గల చేప పిల్లలు ఒక్కోదానికి రూ. 1.32 చొప్పున రూ.33 లక్షలు ఖర్చు చేశారు. రొ య్యలు, చేప పిల్లలను రూ.94.23 లక్షలతో అధికా రులు కొనుగోలు చేశారు.
మత్స్యకార కుటుంబాలకు లబ్ధి
జిల్లాలోని 600 చెరువుల్లో చేప పిల్లలు, ఎంపిక చేసి న ప్రాజెక్టులు, చెరువుల్లో రొయ్య పిల్లలను వదలడం ద్వారా వాటి పెంపకంతో నాలుగు వేల మంది మత్స్యకారులకు ఉపాధి లభించనున్నది. జిల్లాలో 105 మత్స్యకారుల సంఘాలు ఉండగా వాటిలో నాలుగు వేల మంది సభ్యులుగా ఉన్నారు.
లఖ్నాపూర్ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను వదిలిన ఎమ్మెల్యే
మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, ప్రాజెక్టుల్లో వదులుతున్నదని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టులో ప్రభుత్వం అందించిన 1,33,500 రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. అందుకోసం ప్రతి ఏడాది చేప, రొయ్య పిల్లలను కొనుగోలు చేసి ఉచితంగా రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో వదులుతున్నట్లు తెలిపారు. చేప, రొయ్య పిల్లల పెంపకంతో వికారాబాద్ జిల్లాలోని దాదాపు నాలుగు వేల మంది మత్స్యకారులకు ఉపాధి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, మత్స్యశాఖ ఏడీ చరిత, మత్స్య సహకార సంఘాల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.