మొయినాబాద్, నవంబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామా ల అభివృద్ధికి పెద్దపీట వేసిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.7 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు పనులను ఎంపీపీ గునుగర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు శాశ్వత అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నదన్నారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఉమ్మడి పాలన కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం భిన్నంగా అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. అదే విధంగా బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాంటి పాలన ఎప్పుడు కూడా చూడలేదని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎం మమత, ఎంపీడీవో సంధ్య, వెంకటాపూర్ సర్పంచ్ మనోజ్కుమార్, ఎల్కగూడ సర్పంచ్ కుమార్, మేడిపల్లి ఎంపీటీసీ అంజ య్య, మాజీ ఎంపీటీసీలు రవీందర్,ఎం వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షులు జి జయవంత్, ఎంఏ రావూ ఫ్, నాయకులు అంజయ్యగౌడ్, రాజు, రాములు,డి రాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే శుభోదయం
షాబాద్ : ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం ఉదయం షాబాద్ మండలంలోని బోడంపహాడ్, అంతారం గ్రామాల్లో శుభోదయం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందేనన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు వ్యవసాయంపై మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో సగం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, మిగతా గ్రామాల్లో కూడా త్వరలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు గంగాపురం కృష్ణారెడ్డి, బండి యాదమ్మ, ఎంపీటీసీలు గూడూరు సరళ, కరుణాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, ఎంపీడీవో అనురాధ, ఏవో వెంకటేశం, డీఈఈ విజయ్కుమార్, ఏఈలు దివ్య, శారద, నరేందర్, ఎంపీవో హన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, ఉపాధ్యక్షులు కారు చెన్నయ్య, యాదిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, పార్టీ నాయకులు రాంచంద్రారెడ్డి, ఇనాయత్, శ్రీనివాస్గౌడ్, మహేశ్, నర్సింహులు పాల్గొన్నారు.