తాండూరు రూరల్, నవంబర్ 4 : విద్యాభివృద్ధిలో భాగంగా ( కేజీ టూ పీజీ) చేపట్టిన తెలంగాణ మైనార్టీ (బాలుర) గురుకులం పాఠశాల భవనం ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ సర్కార్ విద్యాభివృద్ధికి కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నది. అందులో భా గంగా తాండూరు మండలం, జినుగుర్తి గేట్ సమీపంలో తెలంగాణ మైనార్టీ గురుకులం (బాలుర) పాఠశాలను సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నది. ఈ పాఠశాల భవనంతోపాటు వసతి గృహ నిర్మాణానికి సర్కార్ రూ.18 కోట్ల మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణాన్ని మరో రెండు నెలల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు మిగిలిన పనులను చకచకా పూర్తి చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల రాజీవ్ గృహకల్ప సమీపంలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్నది.ఐదు నుంచి 10వ తరగతి వరకు 445 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో అభ్యసిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు మరో చోట విద్యా భ్యాసం చేస్తున్నారు. టీచింగ్ సిబ్బంది 17 మంది, నాన్ టీచింగ్ స్టాఫ్ 10 మంది ఉన్నారు. సొంత భవనం పూర్తయితే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమస్యలు తొలగిపోనున్నాయి. పాఠశాల ప్రధాన ద్వారం నుంచి పాఠశాల, వసతి గృహం వరకు సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీటి పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు విశాలమైన మైదానం ఉంది. మైనార్టీ గురుకులం పాఠశాలలో ఇప్పటికే ప్రిన్సిపల్ ఉండే క్వార్టర్ నిర్మాణం పూర్తయింది. అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఈ క్వార్టర్ను నిర్మించారు.
విద్యార్థులకు బంగారు భవిష్యత్
మరో రెండు నెలల్లో పాఠశాల భవనం పూర్తికానుంది. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్నది. సొంత భవ నం పూర్తయితే ఐదోతరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులందరినీ అక్కడి మారుస్తాం. మైనార్టీ గురుకు లంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతోపాటు రుచికరమైన భోజనం ఉంటుంది.. అదేవిధంగా విద్యార్థులకు బట్టలు, బూట్లు ఉచి తంగానే ప్రభుత్వం ఇస్తున్నది. గురుకులంలో చదువునే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంది. – అయిషా ఉన్నీసా, ప్రిన్సిపాల్