వికారాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యా న్ని అందించేందుకు చర్యలను ముమ్మరం చేసిం ది. ఇప్పటికే పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి అవసరమైన వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు సరిపడా మందులనూ పంపిణీ చేస్తున్నది. ముఖ్యంగా గత ఎనిమిదేండ్ల కాలంలో ప్రభుత్వ దవాఖానల బలోపేతానికి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖాన ల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి. దీంతో ప్రజలు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు. సాధారణ జ్వరం మొదలు ప్రసవాలు, డయాలసిస్ వర కు చికిత్స పొందుతుండటం గమనార్హం. అయితే కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండ టం, ప్రైవేట్ దవాఖానల్లో డయాలసిస్ ప్రక్రియకు రూ.లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్న నేపథ్యంలో పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే డయాలసిస్ సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
జిల్లాకు మరో రెండు డయాలసిస్ కేంద్రాలు..
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత డయాలసిస్ సేవలను విస్తరించేందుకు ప్ర భుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాలుండగా.. మ రో రెండు కేంద్రాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏరియా దవాఖానతోపాటు తాండూ రు పట్టణంలోని జిల్లా దవాఖానలో ప్రజలకు డయాలసిస్ సేవలందుతున్నాయి. అదేవిధంగా త్వరలో కొడంగల్, పరిగిలోని ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులను సైతం మంజూరు చేసింది. అయితే ఇటీవల నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చిన 50 పడకల నూతన దవాఖానలో ఐదు యంత్రాలతో ప్రజలకు డయాలసిస్ సేవలను అందించనున్నా రు. మరోవైపు పరిగి ప్రభుత్వ దవాఖానలోనూ డయాలసిస్ కేంద్ర ఏర్పాటుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి గ్రీన్సిగ్నల్ ఇవ్వగా.. జిల్లా ఉన్నతాధికారులు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. త్వరలోనే పరిగికి డయాలసిస్ కేంద్రం మంజూరు కానున్నది. ఐదు యంత్రాలు ఈ దవాఖానకు రానున్నాయి. కాగా వికారాబాద్లోని డయాలసిస్ కేం ద్రంలో ఐదు యంత్రాలుండగా ఐదు పడకలున్నాయి. తాండూరు జిల్లా దవాఖానలోని డయాలసిస్ కేం ద్రంలో ఎనిమిది యంత్రాలుండగా ఎనిమిది పడకలున్నాయి. వికారాబాద్, తాండూ రు దవాఖానల్లోని డయాలసిస్ కేంద్రాల ద్వారా రోజుకు దాదాపుగా 120 మంది పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలందుతున్నాయి.
త్వరలో కొడంగల్లోనూ సేవలు
ప్రస్తుతం వికారాబాద్ ఏరి యా దవాఖాన, తాండూరులోని జిల్లా దవాఖానల్లో డయాలసిస్ రోగులకు ఉచితంగా సేవలందుతు న్నాయి. ఆ సేవలను మరింత విస్తరించే ప్రక్రియలో భాగంగా కొడంగల్, పరిగి దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొడంగల్కు డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. పరిగిలో డయాలసిస్ కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం.
– పల్వన్కుమార్, డీఎంహెచ్వో వికారాబాద్
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటా..
నేను గత ఐదేండ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. వారానికి మూడు రోజులపాటు డయాలసిస్ చేయించుకునేందుకు వికారాబాద్లోని ప్రభుత్వ దవాఖానకు వస్తున్నా. ఇక్కడ సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తుండటంతో ఆరోగ్యం కుదుటపడుతున్నది. ప్రైవేట్ దవాఖానల్లో డయాలసిస్ చేయిం చుకుంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ డయాలసిస్ రోగులకు ప్రతినెలా రూ.2016 పింఛన్ ఇవ్వడంతో ఆ డబ్బులతో మందులను కొంటున్నా. దీంతో ఏ ఇబ్బంది లేదు. మమ్మల్ని ఆదుకుంటున్న సీఎంకు రుణపడి ఉంటా. – సుశీలమ్మ, కొత్లాపూర్, మర్పల్లి
ఆరోగ్యంగా ఉన్నా..
వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో కిడ్నీ రోగులకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. రోజుకు 20 మంది వరకు డయాలసిస్ చేస్తున్నారు. నేను వారానికి మూడు రోజులపాటు ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ను అందిస్తూ ఆదుకుంటున్నది. – తిరుమలయ్య, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు