శంకర్పల్లి, నవంబర్ 4: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు కొత్తకళ వచ్చిందన్నారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతన్నకు అండగా నిలుస్తున్నారని అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదుగాలని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఎంపీపీ గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ నాయకులు అధికారులు సమన్వయంతో పని చేసి మండలంలోని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. మిర్జాగూడ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్గౌడ్ మాట్లాడుతూ వెంకయ్య కట్టను కబ్జా చేసి రియల్టర్కు కొందరు నేతలు విక్రయించారని, దానిపై విచారణ జరిపించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.
శేరిగూడ గ్రామంలో నాలాలు కబ్జాకు గురయ్యాయని, వాటిని రక్షించాలని సర్పంచ్ సత్యనారాయణ అన్నారు. మహరాజ్పేట్ గ్రామానికి జడ్పీటీసీ నిధులను మంజూరు చేయాలని సర్పంచ్ నర్సింహరెడ్డి కోరారు. ఉత్తమ పంచాయతీ అవార్డులను క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యటించి ఇవ్వాలని ప్రొద్దటూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి సభ దృష్టి కి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎంపీడీవో వెంకయ్య, ఎంఈవో అక్బర్, జడ్పీటీసీ గోవిందమ్మ, ఉప తహసీల్దార్ ప్రియాంక, సర్పంచులు సుమిత్రా, అశ్విని, లలితా, రవీందర్గౌడ్, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు నాగేందర్, శోభ, మల్లమ్మ, కార్యదర్శులు పాల్గొన్నారు.
పేదలకు సర్కార్ అండ
ఆడబిడ్డల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో పేద కుటుంబాలను ఆదుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 74మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం పేదలకు ఎంతగానో భరోసాను కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, చేవెళ్ల తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, సర్పంచ్లు మల్లారెడ్డి, నరహరిరెడ్డి, మాణిక్యరెడ్డి, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, బీసీ ఎల్ ఉపాధ్యక్షుడు రామగౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, నాయకులు రమణారెడ్డి, శేరి దర్శన్, ఉద్యమ కారుడు రాజు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి శుభోదయం
చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి 7వ తేదీ నుంచి శుభోదయ కార్యక్రమం చేపట్టనున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఒక గ్రామంలో శుభోదయం 6గంటల నుంచి గ్రామంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిరిగి ఆ గ్రామంలో సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ నెల 7వ తేదీన షాబాద్ మండలంలోని బోడంపాడు, అంతారం గ్రామాల్లోని అన్ని వార్డులను పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. 8వ తేదీన మొయినాబాద్ మండలం, 9వ తేదీన చేవెళ్ల మండలంలో ఊరెళ్ల, దేవుని ఎర్రవల్లి గ్రామాల్లో శుభోదయం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
సీఎం రిలీఫ్ఫండ్ చెక్కుల పంపిణీ
మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కాలె యాదయ్య క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, చేవెళ్ల తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, సర్పంచ్లు మల్లారెడ్డి, నరహరిరెడ్డి, మాణిక్యరెడ్డి, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, బీసీ ఎల్ ఉపాధ్యక్షుడు రామగౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, నాయకులు రమణారెడ్డి, శేరి దర్శన్, ఉద్యమ కారుడు రాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.