పరిగి, అక్టోబర్ 8 : జాతీయ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ను అన్ని వర్గాల పార్టీగా ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కార్యాలయాన్ని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రతిపక్ష పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు జరుగాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ దిశగా జాతీయ స్థాయిలో అడుగిడిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, పార్టీ నాయకులుబి రవికుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, గ్రామ రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, చరణ్రాజ్, చెన్నయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం పూడూరు మండలం సిరిగాయపల్లి గ్రామంలో సైబేజ్ ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా వ్యవసాయ యంత్రాలు, గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రాంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ సైబేజ్ ఆశ సంస్థ ద్వారా గ్రామానికి సుమారుగా రూ.34లక్షలతో అభివృద్ధి పనులు చేయించడం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.25లక్షల వరకు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు వ్యవసాయ సాగు ఖర్చులు నియంత్రించేలా సంస్థ ద్వారా 60 మంది రైతులకు 6 కలుపు కోత మిషన్న్లు, వైద్యశిబిరం నిర్వహించడంపై సంస్థ సభ్యులకు అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ కవిత, సైబేజ్ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటీవ్ ఎ.సురేశ్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు రాంగోపాల్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి, సీతారాంరెడ్డి ఉన్నారు.