పెద్దఅంబర్పేట, జూలై 23 : ఆదివారం మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందే నియోజకవర్గంలో చేపడుతున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపాలిటీలోని కుంట్లూరు క్రీడా ప్రాంగణంలో పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ చెవుల హరిశంకర్తో కలిసి చైర్పర్సన్ చెవుల స్వప్న మొక్కలు నాటారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని పిలుపునిచ్చారు. 250కి పైగా మొక్కలు నాటినట్టు హరిశంకర్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు అనుపమ, రోహిణిరెడ్డి, కోటేశ్వర్రావు, మున్సిపల్ మేనేజర్ కిరణ్కుమార్, డీఈఈ అశోక్కుమార్, నాయకులు చిరంజీవి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మండలంలో జోరుగా హరితహారం
యాచారం : మండలంలో హరితహారం శనివారం జోరుగా కొనసాగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రామాల్లో మొక్కలు నాటారు. మండలంలోని చౌదర్పల్లి, యాచారం గ్రామాల్లో ఎంపీపీ సుకన్య, ఎంపీడీవో విజయలక్ష్మి, నందివనపర్తిలో సర్పంచ్ ఉదయశ్రీ హరితహారం కింద మొక్కలు నాటారు. ఇంటికి ఆరు మొక్కల చొప్పున ప్రజలకు పంపిణీ చేశారు. ఖాళీ స్థలాల్లో, రోడ్డుకిరువైపులా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీవో విజయలక్ష్మి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
అబ్దుల్లాపూర్మెట్ : మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని అబ్దుల్లాపూర్, బాచారం, తారామతిపేట్, గౌరెల్లి, పసుమాముల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గూడెపు సాయికిరణ్గౌడ్, పందికొక్కుల శివ, కాటం రఘుగౌడ్, శ్రీకాంత్గౌడ్, తలారి అజయ్, చెవుల మహేశ్ పాల్గొన్నారు.