పరిగి, జూలై 16 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదవారికి అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని తన నివాసంలో పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.40.31లక్షలకు సంబంధించిన చెక్కులు, నలుగురికి చికిత్స నిమిత్తం రూ.8.09లక్షలకు సంబంధించిన ఎల్వోసీ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వేలాది మంది పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందుతున్నదని పేర్కొన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్తో ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు. మరోవైపు సర్కారు దవాఖానలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిగి, కులకచర్ల, పూడూరు ఎంపీపీలు అరవిందరావు, సత్యమ్మ, మల్లేశం, దోమ, పూడూరు జడ్పీటీసీలు నాగారెడ్డి, మేఘమాల, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీ అందజేత
చౌడాపూర్ మండల పరిధిలోని మందిపల్ గ్రామానికి చెందిన కోస్గి భీమమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి రూ.61వేల సీఎంఆర్ఎఫ్ ఎలోవోసీని ఆమె కుటుంబసభ్యులకు శనివారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, టీఆర్ఎస్ పార్టీ మందిపల్ నాయకుడు రాజశేఖర్ పాల్గొన్నారు.