పెద్దేముల్ : రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆయా గ్రామాల విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను వీలైనంత త్వరగా విధుల్లో సర్దుబాటు చేయాలని వీఆర్వోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు కోరారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో తాసిల్దార్ ఫహీం ఖాద్రికి ఆయా గ్రామాల వీఆర్వోలతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ పాలన పరంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి సుమారు సంవత్సరం అయిందని, ప్రజలకు, ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి అనుసంధానంగా ఎన్నో ఏండ్ల నుంచి సేవలు అందించిన ఆయా గ్రామాల వీఆర్వోలను ఉద్యోగరీత్యా విధుల్లో వీలైనంత త్వరగా సర్దుబాటు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో ఆయా గ్రామాల వీఆర్వోలు జంగయ్య, నర్సింహులు, సురేష్, ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.