తాండూరు రూరల్, మే 28 : పది గంటల తర్వాత బయటికి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని గౌతాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద సీఐ జలెందర్రెడ్డి, ఎస్సై ఏడుకొండలు వాహనాలను తనిఖీ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 14 మోటర్ సైకిళ్లతోపాటు 6 నాలుగు, మూడు చక్రాల వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రమే ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేయాలన్నారు. తాండూరు నుంచి వివిధ గ్రామాలకు వాహనాలతో పాటు పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.