ప్రాథమిక కేంద్రాలకు తరలివస్తున్న ప్రజలు
45 ఏండ్లు నిండిన వారంతా అర్హులే
బ్లాక్ మండలాల్లో 2,670 మందికి వ్యాక్సిన్
ఆమనగల్లు, ఏప్రిల్18 : కొవిడ్ విస్తరించకుండా వ్యాక్సినే అసలైన ఆయుధం అని వైద్యనిఫుణులు, వివిధ శాఖల అధికారులు ప్రజలకు అవగాహన పెంచడంతో ప్రజల్లో మార్పు మొదలైంది. వ్యాక్సిన్ కోసం ప్రాథమిక కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వారం రోజుల నుంచి ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని ఆరు ప్రాథమిక వైద్య కేంద్రాలల్లో వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ముందస్తుగా వివరాలను అందజేస్తున్నారు.
వ్యాక్సిన్ కోసం బారులు..
ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల మండలంలోని ప్రాథమిక కేంద్రాల వద్ద ఒకవైపు వ్యాక్సిన్లను ప్రజలకు వేస్తూనే మరోవైపు కరోనా అనుమానితులకు పరీక్షలు చేస్తూ వైద్యసిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. టీకా వేయించుకున్న 100 మందిలో కేవలం 1శాతం మాత్రమే స్వల్ప అనారోగ్య లక్షణాలు ఉండటంతో ప్రజల్లో భయం వీడింది. ఆమనగల్లు ప్రాథమిక కేంద్రంలో 800, కడ్తాల (మైసిగండి) ప్రాథమిక కేంద్రంలో 670, తలకొండపల్లి ల్లో 400, మాడ్గుల మండలాల ప్రాథమిక వైద్య కేంద్రాల పరిధిలో 800 మంది వ్యాక్సిన్లను తీసుకున్నారు.
వ్యాక్సిన్ సురక్షితం:దీన్దయాల్, డిప్యూటీ డీఎంహెచ్వో, కందుకూర్ డివిజన్
వైరస్ విస్తరించకుండా ఉండాలంటే బాధ్యతగా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు, సమాజ సేవకులు ఫ్రంట్ వారియర్స్ ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో మాస్కు విధిగా ధరించాలి.
ఇవి కూడా చదవండి
పదమూడో రోజూ మత్తడి దుంకుతున్న హల్దీవాగు
మా కోసం ఏమీ చేయొద్దు.. మాస్క్లు ధరిస్తే చాలు..! ఓ వైద్యుడి భావోద్వేగం