హల్దీవాగులో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేసి పదమూడో రోజైన చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్లోని చెక్ డ్యాం నిండి మత్తడి దుంకింది. హల్దీవాగుపై ఉన్న 32 చెక్ డ్యాంలకు గానూ ఆదివారం వరకు 25 నిండాయి. మరో నాలుగైదు రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకుంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు