తాండూరు, మే 13: మతసామరస్యానికి ప్రతీ కైన ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను శుక్రవారం నిర్వ హించేందుకు జిల్లాలో ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ ప్రభావంతో రం జాన్ ఉపవాస దీక్షలు తక్కువ మంది చేపట్టారు. ప్రభుత్వ సూచనల మేరకు తరావీహ్ ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకున్నారు. ‘ఈద్ ముబారక్’ ఘడి యకు ముందు రోజైన గురువారం ఉదయం 10 గంటలలోపు తాండూరు పట్టణంలోని దుకా ణాల్లో సందడి నెలకొంది. కొత్త బట్టలు, టోపీలు, పాదరక్షలు, అత్తర్లు, సుర్మాలు, గాజులు, నోరూరించే సేమియాలు, డ్రైఫూట్స్ తదితర రం జాన్ కొనుగోళ్లతో తాండూరు కిటకిటలాడింది. ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకునేందుకు తాండూరు పట్టణంతో పాటు జిల్లాలోని ముస్లింలు కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఉం డడంతో నిరాడంబరంగా ఏర్పాట్లు చేసుకున్నా రు. ఈద్గా వద్దకు ఎవరు వెల్లకుండా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెన్గేష్పూర్లోని ఈద్గాను సీఐ జలేందర్రెడ్డి ముస్లిం పెద్దలతో కలిసి సంద ర్శించారు. ఎవరు ఇక్కడ సామూహిక ప్రార్థనలు చేయరాదని సూచించారు.