వికారాబాద్ : అనంతగిరిలో మద్యం సేవించిన యువకులపై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతపద్మానాభ స్వామి దేవాలయం నుంచి నందిఘాట్ వెళ్లే దారిలో హైదరాబాద్కు చెందిన పలువురు యువకులు మద్యం సేవిస్తున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న అనంతగిరి పోలీసులు వారిని పట్టుకొని వికారాబాద్ పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పర్యాటక ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని సూచించారు.