తాండూరు : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సంబురాలు నిర్వహించారు. ఉత్తమ రైతులుగా ఎన్నికైన తాండూరు మండలం మల్కాపూర్కు చెందిన జ్యోతి, వికారాబాద్ మండలం ఎన్నెపల్లికి చెందిన నగేశ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ నూతన వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరించాలన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్న తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. సుధాకర్, ప్రవీణ్, యమునరెడ్డి, రాజేందర్రెడ్డి, సందీప్, మానిక్య మిన్ని ఉన్నారు.