వికారాబాద్, జూన్ 9 : ఉచిత కంటి వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆనంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు సరైన చికిత్సలు చేయించుకోవాలన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల అందుబాటులో ఉన్నారని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కంటి పరీక్షలు చేయించుకున్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, డైరెక్టర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.