పరిగి, ఏప్రిల్ 28 : వికారబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని మండలాల్లో రూ.2కోట్లు వెచ్చించి కరెంటు సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం ఎంపీపీ కరణం అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు గుర్తించాలని ట్రాన్స్కో ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రతి మండలంలో సుమారు రూ.50లక్షలు వెచ్చించి కరెంటు సంబంధిత పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గంలో సుమారు రూ.18కోట్లు ఖర్చు చేసి ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. త్వరలోనే ఏసీడీపీ నిధులు రానున్నాయని, ప్రతి గ్రామానికి రూ.5లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతుమాని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా పరిషత్ భవనం శంకుస్థాపన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ప్రతి ఎంపీటీసీకి రూ.10లక్షలు ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం మారిపోయిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, ఎంపీడీవో శేషగిరిశర్మ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.