పరిగి, ఆగస్టు 15: ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి పెంచేలా.. దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తున్నదని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు అన్నారు. విద్యార్థుల నుం చి ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు, సబ్బండవర్గాల వా రు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నా రన్నారు. సోమవారం వికారాబాద్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకా న్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఆగస్టు 8 నుంచి 14వ తేదీ వరకు ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ, మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, ఫ్రీడం రన్, వజ్రోత్సవాల ర్యాలీలను నిర్వహించడం జరిగిందన్నారు. 15 నుంచి 21వ తేదీ వరకు ఇంటింటా జాతీయ జెండావిష్కరణ, పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనాలు, రక్తదాన శిబిరాలు, ఫ్రీడం కప్ పేరి ట క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అనాథ, వృద్ధ్దాశ్రమాలు, దవాఖానలు, జైళ్లలో పండ్లు, మిఠాయిల పంపిణీ, ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించా రు. స్వాతంత్ర సమరయోధుల త్యాగనిరతి, ధైర్యసాహసాలను స్మరిస్తూ ఆ మహానుభావులు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించేందుకు అంద రం పునరంకితమవుదామన్నారు. తెలంగాణ ప్ర త్యేక రాష్ట్రంగా ఏర్పడి కేసీఆర్ సీఎంగా నియమితులైన తర్వాత రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇక్కడ సమకూరే సంపద ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు..
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. జిల్లా లో ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున ఐ దు నియోజకవర్గాల్లోని 358 మంది దళిత కుటుంబాలకు నిధులు మంజూరు చేశామన్నా రు. జిల్లాలో మైనారిటీ విద్యార్థుల కోసం ఐదు వసతిగృహాలు మంజూరు కాగా.. వాటిలో రెండు హాస్టళ్ల పనులు పూర్తైనట్లు తెలిపారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ముగ్గురిని ఎం పిక చేసి రూ.60 లక్షల ఆర్థిక సాయాన్ని అందిం చామన్నారు. జిల్లాలో 2022-23 సంవత్సరానికి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 5,84,791 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ‘మన ఊరు-మన బడి’ లో భాగంగా బడుల్లో గదుల మరమ్మతులు, ఫర్నిచ ర్, మూత్రశాలల నిర్మాణంకోసం మొదటి విడు త కింద 371 బడులను ఎంపిక చేయగా పను లు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 2021-22 సంవత్సరానికి ఉపాధిహామీ పథకం కింద 904 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 37.33 కోట్లను మంజూరు చేశామన్నారు. జిల్లాలో రూ.9.26 కోట్లతో 198 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. 545 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నట్లు డిప్యూటీ స్పీకర్ చెప్పారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ నూతన భవనాన్ని రూ.60.70 కోట్లతో అన్ని హంగులతో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వికారాబాద్ జడ్పీ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను మూడు ఎకరాల విస్తీర్ణంలో రూ.5.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 17 నూతన గ్రామపంచాయ తీ భవనాలను రూ.2.92 కోట్లతో నిర్మించినట్లు.. 12 బీటీ రోడ్ల పనుల్లో నాలుగు పూర్తి పూర్తైనట్లు పేర్కొ న్నారు. జిల్లాలో 578 గ్రామపంచాయతీ లుం డగా అందులో 541 గ్రామపంచాయతీల్లో గ్రా మీణ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి స్థలాల గుర్తింపు పూర్తైనట్లు తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలందించిన అధికారులకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి, వికారాబాద్, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతుల కోసం రైతు వేదికలు..
పంటల సాగులో రైతులకు మెళకువలు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలో 19.89 కోట్లతో 97 రైతు వేదికలను నిర్మించినట్లు డిప్యూటీ స్పీకర్ వివరించారు. 2022 సంవత్సరానికి రైతుబంధు కింద వానకాలంలో 2,34, 441 మంది రైతులకు రూ.280.57 కోట్ల నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. 2021-22 సంవత్సరానికి రైతుబీ మా కింద 873 మంది క్లయిమ్దారుల నామినీలకు రూ.43.75 కోట్లు అందించడంతోపాటు.. జిల్లాలో 2018 నుంచి 2022 వరకు లక్ష రూపాయలలోపు రుణం ఉన్న 32 వేల మంది రైతులకు రెండు దఫాలుగా రూ.94.64 కోట్ల అప్పులను మాఫీ చేసినట్లు చెప్పారు. కంది పంట దిగుబడిలో మన జిల్లా నుంచే 44 శాతం కంది ఉత్పత్తి చేస్తున్నామన్నారు.
గ్రామాల రూపురేఖలు మార్చిన పల్లె, పట్టణ ప్రగతి..
జిల్లాలోని అన్ని గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీల రూపురేఖలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మార్చివేశాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వైకుంఠధామాలు, పార్కులు, నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, డంపింగ్యార్డులు, పారిశుధ్య అవసరాల కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం సమకూర్చడంతోపాటు.. హరితహారంలో 2022-23లో 38.67లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం గా పెట్టుకోగా ఇప్పటివరకు 28.19 లక్షల మొక్కలను జిల్లాలో నాటడం జరిగిందన్నారు. మిషన్ భగీరథలో భాగంగా 1920 కిలోమీటర్ల పొడవు గల పైపులైన్లు, 871 మంచినీటి ట్యాంకులను పూర్తి చేయడంతోపాటు 1,98,162 నల్లాలను బిగించి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు.
108 కొనుగోలు కేంద్రాల ద్వారా..
యాసంగిలో 108 కొనుగోలు కేంద్రాల ద్వారా 19,639 మంది రైతుల నుంచి 82,610 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.161.91 కోట్ల నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నా రు. రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా జిల్లాలో 11,866 మంది లబ్ధిదారులకు ఒక యూనిట్కు రూ.1,31,250 చొప్పున 75 శాతం సబ్సిడీతో పంపిణీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడంతోపాటు జిల్లాలో కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా ఈసారి 59 మంది లబ్ధ్దిదారులకు రూ. 23.10 లక్షలను మంజూరు చేసినట్లు డిప్యూటీ స్పీకర్ వివరించారు. జిల్లాలో మత్స్యకారుల జీవనోపాధిని పెంచేందుకు 618 మందికి రూ.కోటీ85 లక్షలను వివిధ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలను ఇప్పించామన్నారు. సామాజిక భద్రత కోసం జిల్లాలో 92,801 మందికి ఆసరా పింఛన్ల కింద రూ.217.35 కోట్ల నిధులు పంపిణీతోపాటు స్త్రీ నిధి ద్వారా జిల్లాలో 2022-23 సంవత్సరానికి 880 మహిళా సంఘాల సభ్యులకు రూ.12.92 కోట్ల రుణాల మంజూరు.. బ్యాంకు లింకేజీ ద్వారా 2022-23 సంవత్సరానికి 2,479 సంఘాలకు రూ.124.8 కోట్ల నిధులను అందజేశామన్నారు. 2022-23లో 1,77,450 మంది కూలీలకు 45,82,140 పనిదినాలు కల్పించి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో ఉపాధి హామీ పథకంలో నిలిపినట్లు చెప్పారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 1,106 అంగన్వాడీ కేంద్రాల్లో 67,034 మంది గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం కింద పాలు, మంచి భోజనం అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో గ్రామ బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో 208 బాల్య వివాహాలను ఆపడంతోపాటు ఆపరేషన్ స్మైల్ ద్వారా 350 మంది బాల కార్మికులను సంరక్షించామన్నారు. కల్యాణలక్ష్మి కింద 6,165 మంది లబ్ధిదారులకు రూ.62.33 కోట్లు, షాదీముబారక్ కింద 932 మంది లబ్ధ్దిదారులకు రూ.9.42 కోట్లు అందించినట్లు తెలిపారు.
సంక్షేమంలో ముందుకు..
రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఉచితంగా గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు, కంటి వెలుగు, దళితబం ధు, విద్యార్థులందరికీ సన్నబియ్యంతో కూ డిన భోజనం వంటి మహత్తర కార్యక్రమాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని డిప్యూటీ స్పీకర్ అన్నారు. పాలనను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసింద న్నారు. జిల్లాలో 2021-22లో 7,703 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించడం జరిగిందన్నారు. జిల్లాలో ఈసారి 15,260 మంది గర్భిణులకు సేవలు అందించగా, 11,070 మంది ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 69,680 మం దికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద జిల్లా లో ఇప్పటివరకు 35,268 మందికి రూ. 78.15 కోట్ల విలువైన వైద్యసేవలందించినట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు.