పరిగి, నవంబర్ 19 : టీఆర్ఎస్లో చేరిన వారికి అండగా ఉంటామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.గ్రామంలో ఈసారి దళితబంధు కింద 10 యూనిట్లు, మార్చి నెల తర్వాత మరో 10 యూనిట్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామంలో అభివృద్ధిని మరింత వేగవంతంగా చేపట్టడానికి కృషి చేస్తానన్నారు.
మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరికలు..
పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎంపీటీసీ కొప్పు కృష్ణయ్య, మాజీ సర్పంచ్ కుర్వ నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.పృథ్వీరాజ్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ టి.ప్రదీప్రెడ్డి, ఎ.నర్సింహులు, వార్డుసభ్యులు లక్ష్మి, ప్రవీణ్రెడ్డి, మాజీ వార్డుసభ్యులు కె.మారుతి, పాండునాయక్, బి.శ్రీనివాస్, కొప్పు రవి, గొల్ల సింహం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.డి.రహీం, వెంకటయ్య, బి.వెంకటయ్య, మల్లయ్య, శ్రీనివాస్లతోపాటు సుమారు 300 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కె.నాగారెడ్డి, పరిగి, పూడూరు ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్రెడ్డి, నాయకులు అనిల్రెడ్డి, బి.ప్రవీణ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ మాణిక్యం, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సురేందర్రెడ్డి, విష్ణువర్దన్రెడ్డి పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత..
పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, చౌడాపూర్, గండీడ్ మండలాలకు సంబంధించిన 96 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.43.87లక్షలకు సంబంధించిన చెక్కులు శనివారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ఏడుగురికి చికిత్స నిమిత్తం రూ.14.50లక్షలకు సంబంధించిన ఎల్వోసీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ సర్కారు దవాఖానలు బలోపేతం చేస్తూనే ప్రైవేటు కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలు చేయించుకున్న వారికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.