చేవెళ్ల రూరల్ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రూ. 20 లక్షలతో పల్లెప్రకృతి వనం, పిల్లల ఆట స్థలం, రూ. 6.5 లక్షలతో కంటైనర్ గ్రాంథాలయం, రూ. 6 లక్షలకు పైబడి నిధులతో సీసీ కెమెరాలు, రూ. 25 లక్షలతో గుంతలను పూడ్చివేత, రూ. 5 క్షలతో ఓపెన్ జిమ్ను మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణీ దేవి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రాథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. రూ. 10కోట్లతో జిల్లా వ్యాప్తంగా గ్రథాలయాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద కౌకుంట్ల గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. వివిధ రంగాల్లో ఇప్పటి వరకు లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో 50వేల ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో వివిధ ప్రైవేట్ పరిశ్రమల్లో 11 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు.
జిల్లాలో శంకర్పల్లి, కందుకూరు, మహేశ్వరం మండలాల్లోని నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను ఏర్పాటు చేసి 230మంది అభ్యర్థులకు నేరుగా ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, 340 మంది అభ్యర్థులు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నాని వారికి శిక్షణ అనంతరం ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమెజాన్, ఆక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, జెన్ ప్యాక్, గూగుల్, టెలీ పెర్ఫామెన్స్, రిలయన్స్ ట్రెండ్స్, సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంత్రి నియామక పత్రాలను అంజేశారు.
గ్రథాలయాలు విజ్ఞాన భండాగారాలు..
గ్రథాలయాలు విజ్ఞాన భండాగారాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు గ్రంథాలతో మేలు జరుగుతున్నదని, చేవెళ్ల నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కంటైనర్ గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సబితారెడ్డిని ఎమ్మెల్యే యాదయ్య కోరారు.