ధారూరు, ఫిబ్రవరి 13: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మండల కేంద్రంలోని గ్రామ దేవత మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ధారూరు మండల నాయకులతో కలిసి గ్రామ దేవత మైసమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం తరిగోపుల గ్రామంలో జరుగుతున్న గ్రామ దేవత మైసమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నూతనంగా గ్రామదేవత మైసమ్మతల్లి అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మైసమ్మతల్లి ఆశీస్సులతో గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.
కార్యక్రమంలో ధారూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ధారూరు గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, యువజన విభాగం మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య, రాజుగుప్త, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.