కొడంగల్, జులై 06 : ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పీహెచ్సీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్తో కలిసి రోగులకు ఉచిత భోజన సదుపాయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదలకు కార్పొరేట్ స్థాయిలో సర్కారు దవాఖానలను ఆధునీకరిస్తున్నారని తెలిపారు. పల్లె, పట్టణ దవాఖానాలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
అప్పట్లో ప్రభుత్వ దవాఖాన అంటే భయపడే ప్రజలు నేడు సర్కారు దవాఖాల్లో వైద్యం కోసం క్యూ కడుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్ యాదవ్, రమేష్, వైద్యులు డా.మూర్తి, డా. వీణ, డా. శ్రావణి తదితరులు పాల్గొన్నారు.