పరిగి, మే 27 : చిరుత దాడిలో పశువులు మృతి చెందగా వాటి యజమానులకు అటవీ శాఖ ద్వారా మంజూరైన పరిహారం డబ్బులకు సంబంధించిన చెక్కులు పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2021 నవంబర్ 9వ తేదీన కులకచర్ల మండలం చెరువుముందలితాండకు చెందిన శంకర్కు సంబంధించిన ఆవును చిరుతదాడి చేసి చంపింది.
చౌడాపూర్ మండలం మక్తవెంకటాపూర్కు చెందిన కేతావత్ మేఘ్యకు సంబంధించిన ఆవును 2022 ఫిబ్రవరి 9వ తేదీన చిరుత దాడి చేసి చంపింది. ఈ మేరకు శంకర్కు రూ.35,000, మేఘ్యకు రూ.20వేలు పరిహారం అటవీ శాఖ ద్వారా మంజూరైంది.
ఈ డబ్బులకు సంబంధించిన చెక్కులు శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ హాయ్, కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జెడ్పీటీసీ రాందాస్నాయక్, చౌడాపూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.