పరిగి, జూన్ 01 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంతో పేద వర్గాల దశ మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలోని తమ నివాసంలో రుక్కుంపల్లి గ్రామానికి చెందిన వారికి దళితబంధు కింద మంజూరైన వాహనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో దళితబంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. రూ.10లక్షలు లబ్ధిదారులకు గ్రాంటుగా అందజేస్తున్న ఏకైక పథకం దళితబంధు అని, ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.
రూ.10లక్షలతో కుటుంబం ఒకే యూనిట్ ఏర్పాటు చేసుకోవడం, రెండుమూడు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నా అందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఈ సంవత్సరం నియోజకవర్గంలో 1500 కుటుంబాలకు దళితబంధు ద్వారా లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, రుక్కుంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.