వికారాబాద్ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ దిక్సూచి లాంటి వారన్నారు. స్వ రాష్ట్ర సాధనే ధ్యేయంగా సార్ జీవితాంతం పోరాడారని ఆయన సేవలను కొనియడారు.
సీఎం కేసీఆర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ , మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల, పలువురు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్