కొడంగల్ : దసరా, బతుకమ్మ వేడుకను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ అందిస్తున్న సారెతో మహిళలను గౌరవిస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళలకు చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని తెలిపారు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూనే ప్రతి ఏటా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని, ఈ ఏడాది కూడా రూ. 348కోట్లతో 30డిజైన్లతో చీరలను తయారు చేసి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా పంపిణీ చేస్తున్నామన్నారు. కొడంగల్ మున్సిపల్లో 4,418, కొడంగల్లో 18,170, బొంరాస్పేటలో 20,755, దౌల్తాబాద్లో 17,969 మందికి చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు ముద్దప్ప దేశ్ముఖ్, హేమీబాయి, మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉషారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్డ్డి, కోట్ల యాదగిరితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.